న్యూఢిల్లీ : అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధం విధించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త వినియోగదారులకు కార్డులు ఇవ్వకూడదని ఆదేశించింది. భారతదేశంలోని భారతీయ వినియోగదారుల డాటా, ఇతర సమాచారాన్ని భద్రపరచడానికి నిబంధనలను ఉల్లంఘించడంపై రిజర్వ్ బ్యాంక్ ఈ పరిమితిని విధించింది. ఈ ఉత్తర్వు ఇప్పటికే ఉన్న కస్టమర్లను ప్రభావితం చేయదని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలు చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు. దేశంలో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (పీఎస్ఎస్ యాక్ట్) కింద కార్డు నెట్వర్క్ ఆపరేట్ చేయడానికి వీరిద్దరికీ లైసెన్స్ ఉన్నది.
చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించిన అన్ని సర్వీసు ప్రొవైడర్లు, వారు నిర్వహించే చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన డాటా, ఇతర సమాచారాన్ని ఆరు నెలల్లో తమ ముందు ఉంచేలా చూడాలని 2018 ఏప్రిల్లో సూచించారు.
ఆర్బీఐ యొక్క ఈ చర్యతో మేం బాధపడుతున్నామని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి ఆర్బీఐతో కలిసి పని చేస్తున్నట్లు అమెరికన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. ఈ ఉత్తర్వులు భారతదేశంలో ఉన్న మా కస్టమర్లను ప్రభావితం చేయదని, మా కస్టమర్లు మునుపటిలా కార్డులను ఉపయోగించవచ్చునని పేర్కొన్నది.
భారతదేశంలో పరిస్థితి ఘోరమైనది : డబ్ల్యూహెచ్ఓ
సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
రెమ్డెసివిర్కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..