భువనేశ్వర్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం మూతపడింది. ఆలయాన్ని మే 15 వరకు మూసివేసి ఉంచనున్నట్లు ఆలయం అధికారులు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా పూరీ జగన్నాథ్ ఆలయంలో వివిధ సమస్యలు తలెత్తుతాయని, ఇక్కడికి వచ్చే భక్తులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆలయం బోర్డు అభిప్రాయపడింది. జగన్నాథ్ ఆలయంలో భక్తుల దర్శనం కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ప్రభావితం కావచ్చునని, అటువంటి పరిస్థితిలో పూరి జగన్నాథ్ ఆలయాన్ని మూసివేయడమే మంచిదని నిర్ణయించారు.
జగన్నాథ్ ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కిషన్ కుమార్ అధ్యక్షతన శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో శ్రీమందిర్ వివిధ నిజోగ్ సీనియర్ సేవకులు, జిల్లా కలెక్టర్ సమర్త్ వర్మ, ఎస్పీ కున్వర్ విశాల్ సింగ్, శ్రీమందిర్ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.
పూరీ జగన్నాథ్ ఆలయంలో భక్తుల రాకను నిషేధించారని, రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తవుతాయని సేవకులు తెలిపారు. మహాప్రభు చందన్ యాత్ర, అక్షయ తృతీయ, స్నాన్ యాత్ర, ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర రాబోయే రోజుల్లో జరుగనున్నాయి. అటువంటి పరిస్థితుల్లో బ్రేక్ వర్తించకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోయి అసలుకే ముప్పు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, సాంప్రదాయం ప్రకారం ఈ ఏడాది రథం నిర్మాణ పనుల కొనసాగింపును మే 15 న అక్షయ తృతీయ రోజున ప్రారంభించనున్నారు. ఆలయంలో సేవకులకు మాస్క్లు, శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నా. చందనం, స్నానం, రథయాత్ర కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్నది. పూరీ జిల్లాలో శుక్రవారం 395 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.
అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్పై ఆర్బీఐ నిషేధం
భారతదేశంలో పరిస్థితి ఘోరమైనది : డబ్ల్యూహెచ్ఓ
సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
రెమ్డెసివిర్కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..