ఖాట్మండు: భారత్ ఆర్మీ నుంచి నేపాల్ ఆర్మీకి లక్ష డోసుల కొవిడ్ వ్యాక్సిన్ సోమవారం అందింది. ప్రత్యేక విమానం ద్వారా న్యూఢిల్లీ నుంచి లక్ష డోసుల కొవిడ్ వ్యాక్సిన్లను ఖాట్మండులోని నేపాల్ ఆర్మీకి చేరుకున్నాయి.
ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఇరుగు పొరుగువారి సైనికులకు భారత సైన్యం భారతదేశంలో తయారు చేసిన కొవిడ్-19 టీకాలను అందజేసి తమ మంచి మనసును చాటుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే లక్ష మోతాదుల వ్యాక్సిన్లను నేపాల్ ఆర్మీకి బహుమతిగా పంపించింది.
ఈ టీకాలను త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేపాల్ ఆర్మీకి చెందిన తమ సహచరులకు భారత ఆర్మీ అధికారులు అందజేశారని ఇక్కడి భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
‘భారత సైన్యం నేపాలీ సైన్యానికి బహుమతిగా ఇచ్చిన # మేడ్ఇండియా కొవిడ్-19 వ్యాక్సిన్ 1,00,000 మోతాదులను త్రిభువన్ విమానాశ్రయంలో స్వీకరించారు’ అని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
నేపాల్లోని ఆరోగ్య సంరక్షకులు, ఫ్రంట్ లైన్ కార్మికుల తక్షణ అవసరం కోసం భారతదేశం గతంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ కొవిడ్-19 వ్యాక్సిన్లను నేపాల్కు బహుమతిగా ఇచ్చింది.
ఇదిలావుండగా, చైనా సోమవారం 8,00,000 మోతాదుల యాంటీ కొవిడ్-19 వ్యాక్సిన్లను నేపాల్కు విరాళంగా ఇచ్చినట్లు ఇక్కడ మీడియా నివేదికలు తెలిపాయి.
ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెరోసెల్ టీకాలను నేపాల్లోని చైనా రాయబారి హౌ యాంకీ.. నేపాల్ ఆరోగ్య, జనాభా మంత్రి హృదయేష్ త్రిపాఠికి అందజేసినట్లు ది హిమాలయన్ టైమ్స్ పత్రిక నివేదించింది.
మోదీ పాపులర్ వ్యక్తే కావచ్చు.. కానీ, బెంగాల్లో దీదీ తర్వాతనే : ప్రశాంత్ కిషోర్
తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్..!
భారత్లో త్వరలో మూడో వ్యాక్సిన్కు ఆమోదం : డాక్టర్ రెడ్డీస్
వ్యాక్సిన్ తీసుకున్న పుతిన్కు సైడ్ ఎఫెక్ట్స్
తేడాలు మరచి కలిసి సాగుదాం : కమలా హారిస్ హోలీ సందేశం
చైనాలో చిక్కుకున్న ‘ఎవర్ గివెన్’ ట్రాలీ.. నిలిచిన ట్రాఫిక్
అగ్రి చట్టాలను మంటల్లో వేసి రైతుల ‘హోలీ కా దహన్’
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..