న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజు రోజుకు దిగి వస్తున్నది. మరో వైపు మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 97,743 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో వైపు 1,647 మరణాలు రికార్డయ్యాయని మంత్రిత్వశాఖ చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు పెరిగింది. ఇందులో 2,86,78,390 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,85,137 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 7,60,019 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా 27,23,88,783 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.16 శాతానికి పెరిగిందని తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికంటే తక్కువగా ఉందని, ప్రస్తుతం 3.58శాతానికి చేరిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.98శాతానికి తగ్గిందని.. వరుసగా 12 రోజుల్లో ఐదు శాతానికి తక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 38.92 కోట్ల కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.