న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజాగా 60,729 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో 817 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848కు పెరిగింది. వైరస్ నుంచి మొత్తం 2,94,27,330 బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 3,98,454 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 5,37,064కు చేరాయి. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 33,28,54,527 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా ఉందని, ఇప్పటి వరకు 41.01 కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.