న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లకు కేంద్రం ‘వై’ కేటగిరి భద్రత కల్పించింది. కంపెనీ కరోనాకు వ్యతిరేకంగా హైదరాబాద్కు చెందిన కంపెనీ కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి చేస్తోంది. టీకాలకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇద్దరు లేదా ముగ్గురు కమాండోలు ఆయన వెన్నంటే ఉండనున్నారు. ఇప్పటికే కృష్ణ ఎల్లాకు సీఐఎస్ఎఫ్భద్రత కొనసాగుతోంది. 52 ఏళ్ల కృష్ణ ఎల్ల.. హైదరాబాద్లో భారత్ బయోటెక్ను స్థాపించారు. కరోనా టీకాతో పాటు ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి సహా పలు ఇతర టీకాలను ఆ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. విద్రోహ శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్కు ఇటీవల కేంద్రం సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. ఏప్రిల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారు.. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాకు కేంద్రం వై కేటగిరి భద్రతనూ కల్పించింది.