వాషింగ్టన్ : అమెరికా ఫ్లోరిడాలోని సర్ఫ్సైడ్లో భవనం కూలిన ఘటనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారని మయామి-డేడ్ కౌంటీ మేయర్ మేయర్ డేనియెల్లా లెవిన్ కావా మంగళవారం తెలిపారు. మొత్తం 149 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, శిథిలాలు వారి ప్రయత్నానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబాలకు నివాళులర్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు ప్రథమ మహిళ జిల్ బైడెన్ గురువారం సర్ఫ్సైడ్ను సందర్శించనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మయామి మీచ్ సమీపంలోని ఓ పెద్ద ఓషన్ ఫ్రంట్ కాండో భవనం గత గురువారం పాక్షికంగా కూలిపోయింది. శిథిలాల కింద చాలా మంది వరకు చిక్కుకున్నారని అంచనా. అయితే భవనం కూలడానికి మాత్రం కారణాలు ఇంకా తెలియరాలేదు.