పాట్నా : బిహార్లో పలు ప్రాంతాల్లో మంగళవారం పిడుగులు పడడంతో 11 మంది మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్ జిల్లాల్లో ఆరుగురు, పాట్నాలో ఇద్దరు, నలందా, మాధేపుర, ఔరంగాబాద్లో ఒక్కొక్కరు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డారు. తూర్పు చంపారన్లో నలుగురు, పాట్నా జిల్లాల్లో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి బిహార్లో 339 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. సాధారణం కంటే 139 శాతం ఎక్కువని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ఉత్తర బిహార్లోని వెస్ట్ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సరన్లోని కనీసం జిల్లాల్లో వరదలు సంభవించాయి. సుమారు 65 గ్రామాల్లో 80వేల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. అయితే, ఎలాంటి ప్రానష్టం జరుగలేదని విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రక్షించారు.