పాట్నా: బిహార్లోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కరోనా కలకలం చెలరేగింది. ఎయిమ్స్లోని దాదాపు 384 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్గా తేలిన వారిలో వైద్యులతోపాటు నర్సులు, ఇతర సిబ్బంది ఉండటం కలకలానికి దారితీసింది. పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కరోనా వైరస్ పాజిటివ్గా తేలడంతో రాష్ట్రంలో ఆరోగ్య సేవల పరిస్థితి దయనీయంగా తయారైంది.
బిహార్లో గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో సెకండ్ వేవ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కొవిడ్ పేషెంట్లతో అన్ని జిల్లా కేంద్రాలతోపాటు రాజధాని పాట్నాలోని దవాఖానల్లోని బెడ్లు అన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు చాలా డిమాండ్ ఏర్పడింది. మంగళవారం వరకు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటం, రోగులను తీసుకుని ఎలాంటి చర్యలు తీసుకోకుండానే దవాఖానలకు వస్తుండటంతో ఇక్కడి పలు దవాఖానల సిబ్బంది కూడా కరోనా పాజిటివ్గా తేలుతున్నారు.
బుధవారం నాడు ఎయిమ్స్లో పనిచేస్తున్న దాదాపు 384 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో పరిస్థితి ఆందోళనాకరంగా తయారైంది. వైద్యం అందించేందుకు వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజధానిలోని దవాఖానల్లోని 90 శాతం మంది వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్కు గురయ్యారని అధికారి ఒకరు చెప్పారు. అదేవిధంగా పీఎంసీహెచ్లోని ప్రిన్సిపాల్తోపాటు 30 మంది వైద్యులు, 49 మంది ఇతర సిబ్బంది కరోనా పాజిటివ్గా తేలారు. ఎన్ఎంసీహెచ్లో కూడా పరిస్థితి ఇలాగే ఉన్నది. ఇక్కడ 40 మందికి పైగా సిబ్బందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
బ్రిటన్లో తగ్గిన కొవిడ్ మరణాలు..
తూత్తుకుడిలో 1500 కోట్ల కొకైన్ పట్టివేత
అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల అహరణ
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..