న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఉధృతంగా మారి శ్వాస సమస్యలతో ఇబ్బంది పెట్టడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. యుద్ధ ప్రాతిపదికన కేంద్రం ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆక్సిజన్ బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నవారికి హోం డెలివరీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ హోం డెలివరీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభించారు.
ఢిల్లీ దవాఖానల్లో దిగజారుతున్న పరిస్థితులు, ఆక్సిజన్ కొరత మధ్య కరోనా రోగులకు ఉపశమనం కలిగించేలా ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆక్సిజన్ అవసరమైన కరోనా రోగులు ప్రభుత్వ వెబ్సైట్ delhi.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. చెల్లుబాటయ్యే ఫోటో ఐడీ, ఆధార్ కార్డు వివరాలు, కరోనా పాజిటివ్ రిపోర్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
హోం ఐసోలేషన్లో ఉండి పరిస్థితి తీవ్రంగా ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి హోం డెలివరీ చేసేలా వాహనాలను సమకూర్చారు. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్లాకులో విక్రయించడం, సిలిండర్ల కోసం ఘర్షణ పడటం వంటి సంఘటనలను దృష్టిలోపెట్టుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఆక్సిజన్ను సరఫరా చేయాల్సిందిగా నిత్యం కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నది. అయితే, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ను అవసరమైన వారికి అందించేందుకుగాను ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించారు.
రెజ్లర్ సుశీల్పై హత్య కేసు.. ఛత్రసాల్ స్టేడియంలో ఘర్షణ
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
కరోనాతో నటి అభిలాషా పాటిల్ కన్నుమూత
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
ఒకే కాన్పులో 9 మంది జననం.. మాలిలో ఘటన
నియంత్రణ కోల్పోయిన చైనా రాకెట్.. ఎక్కడ కూలుతుందోనని ఆందోళన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..