వారణాసి : ప్రముఖ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యూ) ను ఈ నెల 15 వరకు మూసివేయనున్నారు. అలాగే, వచ్చే నెల 30 వరకు అన్నిరకాల పరీక్షలను అధికారులు రద్దు చేశారు. కరోనా వైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో బీహెచ్యు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ తరగతులు కూడా జరుగవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం బీహెచ్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీకే శుక్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించన మీదట నిర్ణయించారు.
విశ్వవిద్యాలయం మూసివేసేటప్పుడు అవసరమైన వైద్య సేవలు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, పాడి, వ్యవసాయ క్షేత్రాలు వంటి అత్యవసర పనులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు. విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని మాత్రమే అత్యవసర పనులు ఉన్నప్పుడు పిలుస్తారు. క్యాంపస్లో ఏ ఉద్యోగికైనా కరోనా వైరస్ సోకినట్లయితే సమాచారం ఇచ్చి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నివసిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లయితే వారు ఎస్టేట్ కార్యాలయానికి తెలియజేయాలని తెలిపారు.
వైద్యులు సూచిస్తున్నఔషధం విశ్వవిద్యాలయం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీలో అందుబాటులో ఉంచనున్నారు. రోగి పరిస్థితిని చూసి సీఎంఓ ఇన్ఛార్జి బీహెచ్యూ, సర్ సుందర్లాల్ దవాఖానలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో చికిత్స పొందాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి అధికారులతో సహకరించాలని, వెంటనే హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. క్యాంపస్లో ఉంటున్న సిబ్బంది, వారి కుటుంబాలు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు.
ఒకే కాన్పులో 9 మంది జననం.. మాలిలో ఘటన
నియంత్రణ కోల్పోయిన చైనా రాకెట్.. ఎక్కడ కూలుతుందోనని ఆందోళన
భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం
కేరళలో 8 రోజులు సంపూర్ణ లాక్డౌన్
మంగళసూత్రం ధరించిన వరుడు.. మరి నెలసరి అవుతున్నాడా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..