వాషింగ్టన్ : రోజురోజుకు కరానో వైరస్ ఉధృతమవుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగాలు లేక, ఉన్న ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియక సతమతమవుతున్నారు. అటు అక్కడ ఉండలేక.. ఇటు ఇంటికి రాలేక మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల పరిస్థితి చెప్పనలవి కాదన్నట్లుగా ఉన్నది.
కరోనా కారణంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల ఇబ్బందులు బాగా పెరిగాయి. వైరస్ కారణంగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో హెచ్ -1 బీ వీసా ఉన్నవారికి కేవలం రెండు మార్గాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదటిది ఉద్యోగం పొందడం, వీసా వ్యవధిని పొడిగించడం.. రెండవది యూఎస్ వదిలి వెళ్లిపోవడం. ఈ వర్గం వీసాలకు గ్రేస్ పీరియడ్ మంజూరు చేసినప్పటికీ.. ఈ సమయంలో మరొక ఉద్యోగం పొందడం తలకు మించిన భారంలా తయారైంది. వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పలు సంస్థలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు. అలాంటి వ్యక్తులు అమెరికా విడిచి వెళ్ళవలసి వస్తున్నది.
చాలామంది భారతీయ నిపుణులు ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత కుటుంబ అవసరాలు తీర్చేందుకు వారి ఇంట్లోని సామగ్రిని అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు ఉద్యోగం లేకపోవడం, ఇటు కుటుంబ ఖర్చులకు నగదు లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం పెద్ద సంఖ్యలో విదేశీ నిపుణులు అమెరికాలో నిరుద్యోగులుగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిపుణులు పనుల కోసం హెచ్ 1 బీ వీసాలపై అమెరికాకు చేరుకుంటారు. వారిలో భారతీయుల సంఖ్య అత్యధికం. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు జెన్నిఫర్ మైనర్ ప్రకారం.. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయే విషయంలో చాలా అనిశ్చితి ఉన్నది. ఈ పరిస్థితిలో వలస వచ్చినవారికి ఈ అనిశ్చితి ఖచ్చితంగా పెరుగుతుంది.
భారతదేశంలోని యూఎస్ కాన్సులేట్ను మూసివేశారు. చాలా మంది ఇక్కడ చిక్కుకునిపోయారు
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా భారతదేశానికి అన్ని రకాల ప్రయాణాలను అమెరికా నిషేధించింది. ప్రయాణ నిషేధం ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. తండ్రి శ్రాద్ధకర్మ చేయడానికి తన భర్త భారత్ వెళ్లగా.. నేను నా ఇద్దరు కూతుర్లతో అమెరికా అవస్థలు పడుతున్నాను. ఇలా ఎంతకాలం ఇబ్బందిపడాలో తెలియడం లేదు అని అమెరికాలోని స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ సహ వ్యవస్థాపకురాలు నేహా మహాజన్ వాపోయారు. నేహా మహాజన్ మాదిరిగా చాలా మంది అమెరిలో సతమతమవుతున్నారు.
అయితే భారతీయ నిపుణులు బ్రిటన్లో ఎటువంటి పరిమితులు లేకుండా పని చేస్తున్నారు. దానికి కారణం ఇమ్మిగ్రేషన్కు సంబంధించిన ఒప్పందంపై భారత్-బ్రిటన్ సంతకాలు చేయడమే. ఈ ఒప్పందం కింద భారతీయులకు వర్క్ వీసాలు పెరుగుతాయి. రెండేండ్లపాటు జీవించడానికి, పని చేయడానికి అనుమతి లభిస్తుంది.
కరోనాతో నటి అభిలాషా పాటిల్ కన్నుమూత
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
ఒకే కాన్పులో 9 మంది జననం.. మాలిలో ఘటన
నియంత్రణ కోల్పోయిన చైనా రాకెట్.. ఎక్కడ కూలుతుందోనని ఆందోళన
భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం
కేరళలో 8 రోజులు సంపూర్ణ లాక్డౌన్
మంగళసూత్రం ధరించిన వరుడు.. మరి నెలసరి అవుతున్నాడా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..