రాంచీ : జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ముకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆమెను రాంచీలోని మెడికాకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం గవర్నర్తో సమావేశమైన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే బాగుంటుందని గవర్నర్ ద్రౌపది ముర్ము విజ్ఞప్తిచేశారు. రాజ్ భవన్కు చెందిన కొంతమంది సిబ్బందికి కూడా ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి సోకినట్లు గుర్తించారు.
కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు కరోనా పాజిటివ్గా తేలింది. రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్ సెకండ్ వేవ్ భారీ రూపాన్ని సంతరించుకుంటున్నది. శుక్రవారం జార్ఖండ్లో కరోనా కారణంగా గరిష్ఠంగా 56 మంది మరణించారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తమ్మీద 3,843 కొత్త కరోనా కేసులు కూడా నమోదయ్యాయి. రాంచీలో కరోనా కారణంగా 16 మంది మరణించడం అధికారులను భయపెట్టిస్తున్నది. రాంచీలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,414 కు పెరిగింది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 23 వేలు దాటింది.
కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో రాష్ట్రంలో లాక్డౌన్ విధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఈ విషయంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం జరిపేందుకు నిశ్చయించారు. ఈ సమావేశంలో వ్యక్తమయ్యే అభిప్రాయాల మేరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ సెకండ్ పరీక్షలను జార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది.
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
స్పేస్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన వ్యోమగామి కేట్ రూబిన్స్
నేపాల్లో వైభవంగా విషాల్ సింధూర్ జాతర
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్కు ఎంపీల వినతి
రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..