మాధ్యమిపూర్ : నేపాల్లో ఏటా నిర్వహించే విషాల్ సింధూర్ జాతర వైభవంగా ముగిసింది. వేల సంఖ్యలో భక్తులు హాజరై వసంతాన్ని ఆహ్వానిస్తూ హిందూ నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. సింధూర్, గులాల్ ఒకరిపై ఒకరు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటుండటం ఈ వేడుక విశేషం.
సిందూర్ జాతర నేపాల్ లోని మాధ్యమిపూర్ తిమిలో వైభవంగా జరుపుకున్నారు. ఈ పండుగ వసంత రాకను, హిందూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరుపుకుంటారు. ఈ వార్షిక ఉత్సవంలో 30-35 వేల మంది హాజరయ్యారు. కుంతల్ సిందూర్, గులాల్ చల్లుకుంటూ పండగను జరుపుకుంటారు. పండుగ సందర్భంగా ప్రజలు 32 దేవతల రాజ రథాలను బయటకు తీసి ఊరేగింపు చేపడతారు. ఇందులో సాంప్రదాయ వాయిద్యాల హోరు మధ్య ప్రజలు డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ భక్తి పారవశ్వంలో మునిగిపోతారు.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్నది. ఇప్పటికే పలు దేశాల్లో ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఈ ఆందోళన మధ్య నేపాల్ పౌరులు ఈ సింధూర్ జాతరను నిర్వహించడం సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఊరేగింపు సమయంలో ప్రజలు కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించిన దాఖలాలు కనిపించలేదు. సామాజిక దూరం లేనేలేదు. ఎవరూ మాస్కులు ధరించలేదు.
నేపాల్లో ఇప్పటికే కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నదని స్థానిక అధికారులు చెప్తున్నారు. నేపాల్లో వ్యాక్సిన్ల కొరత ఉన్నది. గత వారం భారతదేశం నుంచి 10 లక్షల మోతాదు వ్యాక్సిన్లు పంపాలని నేపాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం నేపాల్ వ్యాప్తంగా 2.82 లక్షల కరోనా కేసులు నయమయ్యారు. 2.74 లక్షల మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. 3061 మంది మరణించారు.
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్కు ఎంపీల వినతి
రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
టీకా ఆఫర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోటల్స్
భారత్లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..