మాలె: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ప్రమాదానికి గురయ్యారు. గురువారం రాత్రి దేశ రాజధాని మాలెలోని తన నివాసం సమీపంలో కారులో కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నషీద్కు గాయాలయ్యాయి. ఆయన గన్మెన్లు కూడా గాయపడ్డారు. నషీద్ నివాసం సమీపంలోనే ఈ పేలుడు సంభవించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. గాయపడిని నషీద్ను చికిత్స నిమిత్తం మాలె లోని ఏడీకే దవాఖానకు తరలించారు.
పేలుడు సంఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పారు. పేలుడుకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదు. ఇలాఉండగా, నషీద్పై దాడి దేశ ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థపై దాడి అని మాల్దీవుల అధ్యక్షుడు అబ్రహం ముహమ్మద్ సోలిహ్ టెలివిజన్ ప్రసంగంలో అన్నారు. కాగా, నషీద్పై దాడి దర్యాప్తులో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. 53 ఏండ్ల మహ్మద్ నషీద్ 2008 నుంచి 2012 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ స్పీకర్ మజ్లిస్ గా పనిచేస్తున్నారు.
కాలువలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు.. 671 వయల్స్ స్వాధీనం
టోక్యో ఒలింపిక్స్పై కరోనా పంజా: రద్దు చేయాలంటూ ప్రధానికి విజ్ఞప్తి
కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం.. భారతీయులకే ఎక్కువ ప్రయోజనం
ఆన్లైన్ బుక్ చేసుకుంటే.. ఆక్సిజన్ హోం డెలివరీ..
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..