Abbas Aragchi : ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ (Abbas Aragchi) పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) తో భేటీ అయ్యారు. అమెరికాతో శాంతి చర్చల కోసం అరాఘ్చీ శుక్రవారం రాత్రి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) కు చేరుకున్నారు. ఆయనకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్, పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహస్సీన్ నఖ్వీ స్వాగతం పలికారు.
ఇవాళ మునీర్తో అరాఘ్చీ బృందం భేటీ అయింది. మరోవైపు చర్చల కోసం అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్ బయలుదేరారు. అయితే అమెరికా ప్రతినిధులతో నేరుగా సమావేశం ఉండబోదని ఇప్పటికే ఇరాన్ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ పాకిస్థాన్ ప్రతినిధులతో సమావేశమై ఇరాన్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికాతో యుద్ధం ముగింపు విషయంలో కూడా పాకిస్థాన్ ప్రతినిధులతోనే సంప్రదింపులు జరుపుతారు.