అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. టాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా సజ్జాపురంలో పుచ్చకాయలను కోసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే చేపల చెరువులో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను లక్ష్మీకాంతమ్మ (45), హరిబాబు (43), పెంచలయ్య (60), కృష్ణవేణి (26), వెంకటరమణమ్మ (19)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.