అమరావతి : నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మంగళవారం తెల్లవారు జామున పొంగూరు కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై లారీ నిలిచి ఉండగా.. కారు ఢీకొట్టింది. ఇదే సమయంలో ప్రమాదానికి గురైన కారు వెనుక వస్తున్న మరో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.