న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ కొనసాగుతోంది. మూడో విడుత పంపిణీ ఈ నెల 1న ప్రారంభం కాగా.. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వ్యక్తులకు టీకా వేస్తున్న విషయం తెలిసిందే. 24 గంటల్లో 2,15,185 మంది లబ్ధిదారులకు మొదటి డోసును వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే టీకా డ్రైవ్ జరుగుతోందని, గుజరాత్లో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 1,08,188 మంది, రాజస్థాన్లో 75,817, మహారాష్ట్రలో 73,455 టీకాలు వేసినట్లు చెప్పింది. హర్యానాలో 54,946, ఛత్తీస్గఢ్లో 1,025, ఢిల్లీలో 39,799, జమ్మూ కాశ్మీర్లో 5,562, కర్ణాటకలో 2,353, ఒడిశాలో 6,311, పంజాబ్లో 635, తమిళనాడులో 2,521, ఉత్తర ప్రదేశ్లో 33,242 మోతాదులు వేసినట్లు చెప్పింది. సోమవారం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.5లక్షల వ్యాక్సిన్లు వేయగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,88,71,435 డోసులు వేసినట్లు వివరించింది.