నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankars ) సార్ చూపిన మార్గం, సిద్ధాంతాల ( Ideologies ) వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని నల్లగొండ నాయకులు అన్నారు. సార్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న జయశంకర్ విగ్రహానికి నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్, మాజీ జిల్లా అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ కాలంలో కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారని కొనియాడారు.
జయశంకర్ సార్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవమానకరంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. నల్లగొండలోని సార్ విగ్రహానికి అలంకరణ చేసి దండలు వేసే పరిస్థితి కూడా లేకపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పాలన కొనసాగి స్తుందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ మాజీ చైర్మన్ గుండె వెంకటేశ్వర్లు, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్ రావు, లోడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి , సిరిగిరి వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య,,మారగొని గణేష్, దొడ్డి రమేష్, బనావత్ దీప్లా, రత్నగిరి శ్రీనివాస్, గోపగోని స్వాతి, రాజశేఖర్, సింగం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు .