– కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్.వెంకటరమణ
రుద్రంపూర్, ఆగస్టు 06 : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను సింగరేణి కొత్తగూడెం ఏరియాలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజాభివృద్ధి, ప్రజాసేవ, కర్తవ్యనిర్వహణలో ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అంకితభావంతో పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం గోవిందరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఏఐటీయూసీ బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సందేబోయిన శ్రీనివాస్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, ఏజీఎం (సివిల్) సీహెచ్. రామకృష్ణ, ఏజీఎం (ఫైనాన్స్) బిబత్స, ఏరియా ఇంజినీర్ వి.రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్.తిరుపతి, డీవైపీఎం హరీష్, సీనియర్ పీఓ మురళి, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సీహెచ్.సాగర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ కె.సౌజన్య, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.