పెద్దపల్లి : పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి, డైనమిక్ లీడర్ కేటీఆర్ దూర దృష్టి, ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలన్ని శరవేగంగా అభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
మంథని మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్వచ్ఛ ఆటోలను పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ తో కలిసి మంత్రి మంథనిలో ప్రారంభించారు.
అంతకుముందు పట్టణ ప్రజలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూప కల్పన చేసి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.
ఒక్క కరీంనగర్ నగరాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 400 కోట్లు ప్రభుత్వం విడుదల చేశారని, మంథని లాంటి కొత్త మున్సిపాలిటీకి ఇప్పటికే రూ. 15 కోట్లు ఇచ్చారని, మరో రూ. 15 కోట్లు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారని తెలిపారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి
బీన్స్తో డయాబెటిస్కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!