నారాయణపేట : కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం వెళ్లిన ఓ సర్పంచ్ మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని దామరగిద్దలో చోటుచేసుకుంది.
దామరగిద్ద మండలం లింగారెడ్డి పల్లి సర్పంచ్ లక్ష్మి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన బటన్ హోల్ క్యాంప్ (కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం)కు వెళ్లింది.
అయితే శస్త్రచికిత్స పూర్తయిన వెంటనే లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సర్పంచ్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు.
మృతికి కారణమైన వైద్యుడు రవీందర్ పై కఠిన చర్యలు తీసుకొవాలని బంధువులు, మిగతా సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
బీన్స్తో డయాబెటిస్కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు