నాగర్ కర్నూల్ : కల్తీ కల్లు వారి ప్రాణాల మీదకు తెచ్చింది. కల్తీ కల్లు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్ పాముల గ్రామంలో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన గ్రామస్తులు వారిని నాగర్ కర్నూల్ ఏరియా దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.