లేహ్ : లడఖ్లోని లేహ్లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతతో ఉదయం 1.06 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. రాత్రి సమయంలో ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అయితే ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. కార్గిల్కు 16 కిలోమీటర్ల దూరంలో భూమిలో పది కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు మార్చి 6న లేహ్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 3.6 తీవ్రతతో ప్రకంనలు వచ్చాయి.
అలాగే ఉదయం 07.16 గంటల ప్రాంతంలో మిజోరాంలోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 3.2తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని, ఛాంపైకి 140 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..