సంగెం, ఏప్రిల్ 23: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, ఆయా పార్టీల నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్రంగంపేట, ఎల్గూర్స్టేషన్, నర్సానగర్, బిక్కోజీనాయక్ తండా, గవిచర్ల, తిమ్మాపురం, గాంధీనగర్, కొత్తగూడెం, తీగరాజుపల్లి, షాపురం, లోహిత, రాంచంద్రాపురం, ఆశాలపల్లి, కాపులకనపర్తి, గుంటూరుపల్లిలో మంగళవారం గామ కమిటీ సమావేశాలు జరిగాయి.
సమావేశాల్లో చల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, వైస్ ఎంపీపీ బుక్క మల్ల య్య, సంగెం పీఏసీఎస్ చైర్మన్ వేల్పుల కుమారస్వామియాదవ్, సాగర్రెడ్డి, మాజీ ఎంపీపీ సదానందం, దొనికెల శ్రీనివాస్, దిలీప్రావు, మన్సూర్అలీ పాల్గొన్నారు.