పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 29 : నల్లమల అటవీ ప్రాంతంలో నక్కినోనిగండి ప్రాంతంలో పులి దాడిలో ఆవు మృత్యువాత పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామానికి చెందిన సొప్పరి బాలయ్య తన పశువుల మందను మేత కో సం ఆదివారం నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే మందలో నుంచి ఓ ఆవు తప్పిపోయిన తన లేగదూడను వెతుకుతూ వెళ్తున్న సమయంలో నక్కినోనిగండి ప్రాంతంలో మాటుకాచి ఉ న్న పెద్దపులి ఆవును హతమార్చింది. అయితే బాల య్య తన ఆవు మృత్యువాత పడినట్లు గుర్తించాడు.
ఆవు మెడ భాగంపై రక్తాన్ని పీల్చి ఆ తరువాత వెన కి భాగాన్ని చీల్చి తిన్నట్లు, ఇది పెద్ద పులి దాడే అని నిర్ధారణ చేసుకొని తిరిగి వచ్చాడు. ఈ మేరకు బాధితుడు సోమవారం లింగాల ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ రేంజర్ వీరేశం, సిబ్బంది అక్కడికి చేరుకొని ఆవు కళేబరాన్ని పరిశీలించి పులిదాడిలోనే మృతి చెందినట్లు పంచనామా వివరాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా బాలయ్యను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపనున్నట్లు తెలిపారు.