అమరావతి : కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సమీపంలో చోటు చేసుకుంది. భోగిపల్లి సతీష్ (40), కిరణ్మయి(36) దంపతులు కాకినాడలో ఓ పెళ్లికి హాజరై స్వగ్రామం వెలగతోడు వస్తుండగా ప్రమాదవాశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో సతీష్, కిరణ్మయి మృతి చెందారు. కారు వెనుక సీట్లో కూర్చున్న సతీష్ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలను స్థానికులు రక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Vignesh shivan | ధనుష్పై విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్.. ఆయనలో నా తండ్రిని చూసుకున్నా..
170 ఎకరాల్లో కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసే దాకా పోరాటం చేస్తాం: మంచిరెడ్డి కిషన్ రెడ్డి