Warangal | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బైక్ వేగంగా నడుపుతున్నావని మందలించినందుకు ఓ వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నరావుపేట మండలం బాపునగర్కు చెందిన రాజు అనే వ్యక్తి.. వేగంగా బైక్ నడుపుతున్న వారిని మందలించాడు. దీంతో ఆగ్రహించిన వారు ఇనుప రాడ్లు, కర్రలతో అతనిపై దాడి దిగారు. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో బాపునగర్ తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజుపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.