కోహెడ్ మార్కెట్ స్థలాన్ని అమ్మేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్ కోసం కేసీఆర్ ఇచ్చిన స్థలాన్ని డెవలప్మెంట్కు ఇస్తారంట అని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల మార్కెట్ స్థలాన్ని ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లా కోహెడ్ పండ్ల మార్కెట్ను మాజీ మంత్రి హరీశ్రావు సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల ముందు మార్కెట్ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పి నమ్మబలికారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. మూడు వేల మంది చిన్న వ్యాపారుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు. 170 ఎకరాల స్థలంలో పండ్ల మార్కెట్ పెట్టే వరకూ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.