మాలే : భారత్లో రెండో దశలో కరోనా విజృంభిస్తోంది. దీంతో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు భారత్పై ఆంక్షలు విధించాయి. తాజాగా మాల్దీవులు ప్రభుత్వం సైతం కీలకం నిర్ణయం తీసుకుంది. భారత్ సహా దక్షిణ ఆసియా నుంచి వచ్చే పర్యాటకుల వీసాలు తాతాలిక నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, అన్ని రకాల వీసాలకు వర్తిస్తుందని చెప్పింది. గత 14 రోజుల్లో దక్షిణ ఆసియా దేశాల్లో పర్యటించిన ఇతర దేశాల పర్యాటకులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం అమలులో ఉంటుందని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ ట్వీట్ చేసింది. ఈ నిషేధంపై మాల్దీవుల్లోని హైకమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. మాల్దీవులు నిర్ణయం ఇరుదేశాల మధ్య విమాన రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల ఇక్కడ ఉన్న భారతీయులు స్వదేశానికి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాయబార కార్యాలయం సూచించింది.