బూర్గంపహాడ్, ఏప్రిల్ 24 : పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం మెరుపుదాడులు చేశారు. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ సీఐ రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం బూర్గంపహాడ్ మండలంలోని సారపాక పరిధిలోని జామాయిల్ తోటలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ ఎస్ఐ జలకం ప్రవీణ్, సుమన్, సిబ్బందితో కలిసి రైడ్ చేయగా పేకాట ఆడుతున్న 11 మంది పట్టుబడగా ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.57,915 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.