తిరుమల : గోవిందా హరి గోవిందా.. గోకుల నందా గోవిందా అంటూ తిరుమల ( Tirumala ) లో భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. వారాంతపు సెలవుదినాలు కావడంతో శని, ఆదివారాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి ఆక్టోపస్ భవనం ( Octopus Building ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
వేంకటేశ్వరస్వామిని 87,658 మంది భక్తులు దర్శించుకోగా 40,606 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.13 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. 4.15 లక్షల లడ్డూలను విక్రయించామని, 3.09 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వివరించారు.