జెనీవా : భారత్లో మొదటిసారిగా గుర్తించిన కొవిడ్-19 బీ.1.617 వేరియంట్ను ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దేశంలో గత ఏడాది అక్టోబరులో గుర్తించిన కొవిడ్ వేరియంట్ 44 దేశాల ఓపెన్ యాక్సెస్ డేటాబేస్లో అప్లోడ్ చేసిన 4,500కుపైగా శాంపిల్లో గుర్తించామని పేర్కొంది. ఈ రకం వైరస్ కారణంగానే బ్రిటన్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బీ.1.617 వేరియంట్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వారంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
కొత్త రకం వేరియంట్ బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించారు. కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, ఇది ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అసలు వైరస్ కంటే ఈ వైరస్ తేలికగా వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పింది. భారత్లో కేసులు, మరణాల పెరుగుదలకు ఈ వేరియంట్ సైతం కారణమని వివరించింది. 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత్.. అమెరికా తర్వాత దాదాపు 23 మిలియన్ల కొవిడ్ కేసులతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.