అచ్చంపేట, ఏప్రిల్ 29: మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ కందనూలు జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా సోమవారం పట్టణంలోని 12, 20వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని మారుతీనగర్ కాలనీవాసులు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సమస్య లేదని, కాం గ్రెస్ వచ్చినప్పటి నుంచి నీళ్లకోసం గోస పడుతున్నామని మహిళలు వివరించారు. ఇండ్ల మీదుగా వేసిన కరెంటు తీగలను తొలగించాలని కోరగా.. గువ్వల వెంటనే ట్రాన్స్కో అధికారులకు ఫోన్ చేసి సమస్య ను వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసోళ్ల మాటలకు మోసపోయి గెలిపించామని.. ఈసారి త ప్పకుండా బీఆర్ఎస్కు ఓటేస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రె స్ పాలనతోపాటు కరువొచ్చింది.. ప్రభుత్వ పాలన ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు ఇప్పుడే అర్థమవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ అభ్య ర్థి ఆర్ఎస్పీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆరు గ్యారెంటీలను గాలికొదిలి మళ్లీ ఓట్లకోసం వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని.. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు ఖాజాకుత్బుద్దీన్, రమేశ్రావు, అమీనుద్ద్దీన్, సుంకరి బాలరాజు, శంకర్మాదిగ, అంతటి శివ, నిరంజన్, రాకే శ్, ఖాజా, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.