రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రం శివారులోని సర్ధాపూర్ గ్రామంలో మార్కెట్ యార్డును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కేటీఆర్తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మార్కెట్లో రైతులకు రైతులకు కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో రైతుల కోసం నిర్మించిన మార్కెట్ యార్డు జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం సకల సదుపాయాలు, అత్యాధునిక హంగులతో 20 ఎకరాల్లో రూ.20కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టింది. సిరిసిల్ల మార్కెట్ కమిటీ సముదాయం, గిడ్డంగులు ఇక్కడ ఉండగా.. రాష్ట్రంలోనే ఇదే తొలి మోడ్రన్ మార్కెట్ యార్డుగా నిలిచింది.