బీజింగ్ : తూర్పు చైనా సముద్రంలోనిసెంకాకు ద్వీపాన్ని చైనా సర్వే చేసింది. వివాదాస్పద సెంకాకు ద్వీపాన్ని సర్వే చేయడం ద్వారా చైనా ఉద్రిక్తతలను పెంచుతున్నది. తమకు చెందిన ద్వీపాన్ని సర్వే చేపట్టడం పట్ల జపాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్వీపం యొక్క ల్యాండ్స్కేప్ సర్వేను చైనా అధికారులు విడుదల చేశారు. చైనా సెంకాకు ద్వీపాన్ని డియోయు ద్వీపం అని పిలుస్తుంది. 1972 నుంచి ఈ ద్వీపం తమ నియంత్రణలో ఉన్నదని జపాన్ చెప్తుండగా.. ఈ ద్వీపం తమ పరిధిలోకి వస్తుందని చైనా వాదిస్తున్నది.
ల్యాండ్స్కేప్ సర్వే నిర్వహించడం ద్వారా చైనా మరోసారి ఈ ద్వీపం తమదే అని క్లెయిం చేయడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తున్నది. చైనా సహజ వనరుల విభాగం సెంకాకుతో పాటు మరో రెండు ద్వీపాలపై సర్వేను విడుదల చేసింది. ఈ ద్వీపాన్ని జపాన్ తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ.. చైనా , తైవాన్ రెండూ తమ చెందినవంటూ చెప్తున్నాయి.
ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా భౌగోళిక డాటాను మెరుగుపరుస్తామని చైనా మంత్రిత్వ శాఖ మరోవైపు స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ నివేదికతోపాటు పటాలు, ఫొటోలను విడుదల చేసింది. కొన్ని ఫొటోల్లో సర్వే చేపడుతున్న నౌక కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. సెంకాకు ద్వీపం సర్వే, నివేదిక విడుదల చేయడంతో జపాన్తో చైనా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తూర్పు చైనా సముద్రంలోని సెంకాకు ద్వీపం చుట్టూ ఉన్న జలాల్లో అక్రమంగా చొరబడవద్దని, ఇలాంటి చర్యలను నిలుపుదల చేయాలని జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి చైనాను కోరారు.
తక్కువ లక్షణాలున్న కరోనా రోగులపై ఈ ఔషధం ప్రభావవంతం: ఆయుష్ మంత్రిత్వ శాఖ
బోర్డర్ రోడ్ ఆర్గనేజన్లో తొలి మహిళా అధికారిగా వైశాలి నియామకం
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్బీఐ దాడులు
కొవిడ్ చావులపై చర్చ పనికిరానిది.. చనిపోయినవారు తిరిగిరారు : సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన చైనా
100 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్న జో బైడెన్
బంగ్లాదేశ్లో సముద్ర తుఫాను.. లక్షకు పైగా మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..