రోగనిరోధక వ్యవస్థ.. మన శరీరంలో ఉండి మనకు వ్యాధులు రాకుండా కాపాడుతూ.. ఒకవేళ వచ్చినా వాటిని సమర్థంగా పోరాడి పారదోలే యంత్రాంగం ఇది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే నేటి జీవన విధానం, అలవాట్లు కొన్ని దాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. మన చుట్టూ నిరంతరం బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వాటి బారినపడే ప్రమాదముంది. దీంతో రకరకాల ఇన్ఫెక్షన్లు, జబ్బులు దాడిచేస్తాయి. అయితే మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు.
రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మనలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి.
సిట్రస్ జాతి పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్లు ఉంటాయి. ఈ రకం పండ్లలో ఉండే విటమిన్ సీ లేదా ఆస్కార్బిక్ ఆసిడ్ మన శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటంతోపాటు కణజాలం మరమ్మతులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిత్యం వీటిని సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా ఎన్నో నొప్పులను నయం చేసుకునే వీలుంటుంది. అలాగే, ఎములకను కూడా బలంగా తయారుచేసుకోవచ్చు.
ఆమ్లా లేదా ఇండియన్ గూస్బెర్రీగా పిలుచుకును ఉసిరి మన శరీరానికి అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాలుగా వివిధ ఆరోగ్య వ్యాధుల చికిత్స కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. నారింజలో కన్నా వీటిలో 20 రెట్లు ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది. విటమిన్ సీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, చర్మానికి మేలు చేస్తుంది. ఇది కాకుండా, జీవక్రియ, ఎముకల నిర్మాణం, పునరుత్పత్తి, రోగనిరోధక ప్రతిస్పందనను పెంచడానికి ఉసిరి సహాయపడుతుంది. ఆమ్లా జ్యూస్ లేదా రోజూ ఉదయం ఒక పండు తినండం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందిచుకోవచ్చు.
నారింజ ఎన్నో విధాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడే సిట్రస్ జాతి పండు. వీటిని వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. మీడియం సైజ్ ఆరెంజ్ లో 53.2 మి.గ్రా విటమిన్ సీ ఉంటుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మన రోగనిరోధక ఆరోగ్యాన్ని పెంచడానికి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన కణాలను రక్షించడానికి సహాయపడతాయి. జలుబు, ఇతర అలెర్జీలతో బాధపడుతున్న వారికి నారింజ ఎంతో మంచిది. ఈ పండు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి.. ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది.
మన రోగనిరోధక ఆరోగ్యాన్ని పెంచేటప్పుడు కూరగాయలను తరచుగా విస్మరిస్తాం. అయితే ఆశ్చర్యకరంగా బెల్ పెప్పర్లో సిట్రిక్ పండ్లతో సమానంగా విటమిన్ సీ ఉంటుంది. ఈ కూరగాయల్లో బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. బెల్ పెప్పర్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థను నిర్మించడానికి.. చర్మ నాణ్యతను మెరుగుపరచడానికి, కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని తరచుగా బలహీనపరిచే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇవి సహాయపడుతాయి.
విటమిన్ సీ, ఇతర యాంటీఆక్సిడెంట్ల సాధారణంగా లభించే వనరుల్లో నిమ్మకాయ ఒకటి. ఇది విదేశీ వ్యాధికారకాలతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి కణాలను దెబ్బతీసే, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ కలిగించే ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి సహాయపడతాయి. వీటిలో గణనీయమైన మొత్తంలో థయామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ బీ -6, పాంతోతేనిక్ ఆమ్లం, రాగి, మాంగనీస్ ఉన్నాయి.
జీర్ణక్రియ, మంట సమస్యలకు చికిత్స చేయడానికి పైనాపిల్ శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ పండ్లలో విటమిన్ సీ, మాంగనీస్ అధికంగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి.. ఫైబర్, బ్రోమెలైన్ అధికంగా ఉంటుంది. రోజూ పైనాపిల్ తినడం వలన వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్బీఐ దాడులు
కొవిడ్ చావులపై చర్చ పనికిరానిది.. చనిపోయినవారు తిరిగిరారు : సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన చైనా
100 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్న జో బైడెన్
బంగ్లాదేశ్లో సముద్ర తుఫాను.. లక్షకు పైగా మరణం.. చరిత్రలో ఈరోజు
ఎన్నికల అధికారులపై మరణించిన అభ్యర్థి భార్య ఫిర్యాదు
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..