ఛండీగఢ్ : కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న వారి గురించి చర్చించడం పనికిరాని చర్యగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కొట్టిపారేశారు. ఇలా చర్చిండం వల్ల చనిపోయినవారు తిరిగిరారు కదా అని మీడియానే తిరిగి ప్రశ్నించి ఆశ్చర్యానికి గురిచేశారాయన. చనిపోయిన వారి డాటాతో ఆటలాడుకోవడం మనం మానుకొంటేనే మంచిదని ఆయన సెలవిచ్చారు.
బుధవారం సాయంత్రం ఆయన రోహతక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ మరణాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్తో చనిపోయిన వారి గురించి చర్చలు జరుపగడం యూజ్లెస్ అని, అలా చర్చించడం వల్ల వారు తిరిగి బతికిరారు కదా అని బోధించారు. కొవిడ్తో ఎంత మంది చనిపోతున్నారో అన్న విషయాన్ని స్థానిక అధికారులు సమాచారం ఇవ్వడం లేదని స్థానిక మీడియా సీఎం ఖట్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆయన పైవిధంగా స్పందించారు. ఖట్టర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. చనిపోయిన వారి పట్ల సానుభూతి ప్రకటించాల్సి పోయి ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సరికాదని ప్రతిపక్షాలు విచారం వ్యక్తం చేశాయి.
కరోనా వైరస్ను ఏ విధంగా సమర్థంగా నిర్మూలించాలనే దానిపై ప్రభుత్వ ఆలోచిస్తూ చర్యలు చేపడుతున్నది. ఎలా మరణాలను తగ్గించాలనే దానిపై యోచిస్తున్నాం. ఈ దశలో కొవిడ్ మరణాలపై వాదన చేయడం సమంజసం కాదు. ఇప్పుడు వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేయగలమా లేదా అన్నదే ముఖ్యమని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారిని నిర్మూలించడంలో అందరి సహకారం అవసరమని, అదే సమయంలో కరోనా మరణాల డాటా గురించి మాట్లాడటం అంత మంచిది కాదని సెలవిచ్చారు.
సీఎం ఖట్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. ఆయన మాటల క్రూరమైన పాలకుడిని తలపిస్తున్నాయని సూర్జేవాలా అన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగా చనిపోతున్నారని, అందుకని కరోనా మరణాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు.
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన చైనా
100 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్న జో బైడెన్
బంగ్లాదేశ్లో సముద్ర తుఫాను.. లక్షకు పైగా మరణం.. చరిత్రలో ఈరోజు
ఎన్నికల అధికారులపై మరణించిన అభ్యర్థి భార్య ఫిర్యాదు
‘మహారాష్ట్ర లాక్డౌన్ మరో 15 రోజులు పొడగింపు’: మంత్రి రాజేష్ తోపే
కేరళలో అత్యధికంగా 32 వేల కేసులు నమోదు
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..