బంగ్లాదేశ్లో సముద్ర తుఫాన్ సంభవించి లక్ష మందికి పైగా జనం చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ దుర్ఘటన జరిగి సరిగ్గా నేటికి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2 బీ అనే ఈ తుఫాను చాలా ఘోరమైనది. దీనివల్ల సముద్రంలో 15 నుంచి 20 అడుగుల ఎత్తులో తరంగాలు లేచాయి. అనేక దీవులు మునిగిపోయాయి. శవాలను తొలగించే పని 15 రోజుల పాటు కొనసాగింది. ఈ తుఫాను 20 వ శతాబ్దపు అత్యంత భయంకరమైన తుఫానులలో ఒకటిగా పరిగణించబడింది.
చిట్టగాంగ్ నౌకాశ్రయంలో నిలబడి ఉన్న 100 టన్నుల నౌకను తుడిచిపెట్టుకుపోయి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నాఫులి నది వంతెనను ఢీకొట్టిందంటే తుఫాను తీవ్రతను మనం అంచనా వేయవచ్చు. ఆ ఓడ రెండుగా విడిపోయింది. వందలాది పడవలు, ఓడలు కూడా ఇదే విధంగా దెబ్బతిన్నాయి.
చిట్టగాంగ్ ప్రాంతంలో తుఫాను కారణంగా గరిష్ట నష్టం జరిగింది. ఇది బంగ్లాదేశ్ వైమానిక దళం స్థావరం కూడా. మిగ్ -19 తో పాటు సుమారు 40 విమానాలు తుఫాను ధాటికి చాలా నష్టపోయాయి. మృతుల సంఖ్య 1 నుంచి 1.5 లక్షల మధ్య ఉంటుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. 10 లక్షల ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఫలితంగా దాదాపు కోటి మంది నిరాశ్రయులయ్యారు.
2011 : ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ల వివాహం
2010: దౌత్యవేత్తల మధ్య శాంతి చర్చలు ప్రారంభించడానికి అంగీకరించిన భారత, పాకిస్తాన్ ప్రధానమంత్రులు
2008: భారతదేశం-ఇరాన్ మధ్య 7 బిలియన్ డాలర్ల గ్యాస్ పైప్లైన్ ఒప్పందంపై సంతకాలు
2006: హెచ్టీఎఫ్ -6 ను పరీక్షించిన పాకిస్తాన్
1999: జెస్సికా లాల్ను న్యూ ఢిల్లీలోని బార్లో కాల్చిచంపిన కాంగ్రెస్ నేత మను శర్మ
1993: మొదటిసారిగా ప్రజల సందర్శన కోసం తెరిచిన బకింగ్హామ్ ప్యాలెస్
1939: కాంగ్రెస్ రాజీనామా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్
1 954: ఐదు సూత్రాల సంధిపై సంతకాలు చేసిన భారత్-చైనా దేశాలు
ఎన్నికల అధికారులపై మరణించిన అభ్యర్థి భార్య ఫిర్యాదు
‘మహారాష్ట్ర లాక్డౌన్ మరో 15 రోజులు పొడగింపు’: మంత్రి రాజేష్ తోపే
కేరళలో అత్యధికంగా 32 వేల కేసులు నమోదు
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..