Pushpa 2 | అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్’ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజుల క్రితం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ సోషల్మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది.
గంగమ్మ జాతరలో అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ హిందీ థియేట్రికల్ హక్కులను 200కోట్లకు కొనుగోలు చేశారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ఈ సినిమా రైట్స్ను సొంతం చేసుకున్నారని సమాచారం.