న్యూఢిల్లీ : తాము రూపొందించిన ఓ ఔషధం కరోనా వైరస్ తక్కువ లక్షణాలు ఉన్న రోగులపై ప్రభావవంతంగా ఉన్నదని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మలేరియా చికిత్స కోసం 1980 లో ఆయుష్-64 అనే ఔషధాన్ని పరిశోధకులు రూపొందించారు. పుణెకు చెందిన సెంటర్ ఫర్ రుమాటిక్ డిసీజెస్ డైరెక్టర్ అరవింద్ చోప్రా గురువారం నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.
లక్నోకు చెందిన కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కేజీఎంయూ), వార్ధాలోని దత్తా మేఘ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ముంబైలోని బీఎంసీ కోవిడ్ సెంటర్లలో ఈ మందులను పరీక్షించారని చెప్పారు. ప్రతి కేంద్రంలో 70 మంది రోగులకు పరీక్షలు జరిపినట్లు అరవింద్ చోప్రా వెల్లడించారు.
ఈ ఔషధం తీసుకున్నవారిలో సానుకూల ప్రయోజనాలు కూడా కనిపించాయని అరవింద్ చోప్రా తెలిపారు. సాధారణ ఆరోగ్యం, అలసట, విశ్రాంతి సమస్యలు, ఒత్తిడి, ఆకలి, నిద్ర మొదలైన వాటిలో మెరుగుదల కనిపించిందని చెప్పారు. క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, ఆక్సిజన్ అవసరమైన వారిపై పరీక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
బోర్డర్ రోడ్ ఆర్గనేజన్లో తొలి మహిళా అధికారిగా వైశాలి నియామకం
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్బీఐ దాడులు
కొవిడ్ చావులపై చర్చ పనికిరానిది.. చనిపోయినవారు తిరిగిరారు : సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన చైనా
100 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్న జో బైడెన్
బంగ్లాదేశ్లో సముద్ర తుఫాను.. లక్షకు పైగా మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..