నల్లగొండ : నల్లగొండ జిల్లా నకిరేకల్లో(Nakrekal) చైన్స్నాచర్లు(Chain Snatching) రెచ్చిపోయారు. ఓ మహిళపై దాడి చేసి గోల్డ్చైన్తో పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నకిరేకల్ మూసీ రోడ్డులోని రిలయన్స్ ట్రెండ్ వద్ద రోడ్డుపై వెళ్తున్న మహిళను చైన్స్నాచర్స్ అడ్డగించారు. ఆమె మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని దుండగులు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, రోజురోజుకు పెరిగిపోతున్న నేరాల పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు గస్తీని పెంచి భద్రతను కల్పించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మెగా ఫ్యామిలీలో డబుల్ సంతోషం.. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవల పిల్లలు జననం
Dancing Cop | డ్యాన్స్ చేస్తూ వైరల్ అయిన పోలీసుపై మహిళ ఆరోపణలు.. డిమోషన్ ఇచ్చిన అధికారులు