న్యూఢిల్లీ : దేశంలో ఆక్సిజన్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పారిశ్రామిక, వైద్యేతర వినియోగం కోసం ద్రవ ఆక్సిజన్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తక్షణ ప్రభావంతో ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కరోనా సంక్షోభం ముగిసేంతవరకు ద్రవ ఆక్సిజన్ వాడకం వైద్యేతర లేదా పారిశ్రామిక వాడకానికి అనుమతించరు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం అనంతరం హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకం చేసిన ఉత్తర్వును ఆదివారం రాత్రి జారీ చేశారు.
ప్రస్తుతం ఉన్న ద్రవ ఆక్సిజన్ స్టాక్కు కూడా ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయని తెలిపారు. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్లు 10 (2) (ఎల్), 65 కింద ఇవ్వబడిన అధికారాల అనుగుణంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు / యూటీలను ఆదేశించింది.
అన్ని ద్రవ ఆక్సిజన్ను వైద్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని, వాటి ఉత్పత్తిని పెంచడానికి తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనుమతించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ద్రవ ఆక్సిజన్ను వైద్య ఉపయోగం కోసం ప్రభుత్వానికి అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఉత్తర్వు నుంచి ఏ పరిశ్రమకు మినహాయింపు ఉండదు.
గగన్యాన్కు ముందడుగ్గా డాటా రిలే ఉపగ్రహ ప్రయోగం
భారతదేశానికి మద్దతు తెలిపిన జర్మనీ
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఫ్లోరిడాలో బేబీ డైనోసార్ .. కెమెరాకు చిక్కిందంటున్న ఓ మహిళ.. వీడియో
ఘజియాబాద్లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
ఆఫ్ఘాన్ ఆర్మీ పోస్టుపై దాడి.. ఐదుగురు తాలిబాన్ ఉగ్రవాదులు హతం
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..