Harish Rao | హవేలీ ఘనపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్లు బుధవారం హైదరాబాద్లోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధితోపాటు పార్టీ బలోపేతానికి సర్పంచ్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
హరీశ్ రావును కలిసిన వారిలో హవేలీఘనపూర్ సర్పంచ్ మేకల సాయిలు, కొత్తపల్లి సర్పంచ్ నర్ల సాయిలు, సుల్తాన్పూర్ సర్పంచ్ కాట్రోత్ రమేష్, సర్దన సర్పంచ్ వినోద్ సతీష్, గంగాపూర్ సర్పంచ్ లావణ్య యాదగౌడ్తో పాటు మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారు.