ఎల్లారెడ్డి రూరల్/ పెద్దకొడప్గల్/ రామారెడ్డి/ మద్నూర్/ గాంధారి/బాన్సువాడ రూరల్/బాన్సువాడటౌన్/ మాచా రెడ్డి, మే 9 : జహీరాబాద్ గడ్డపై రెపరెపలాడేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమీపం దగ్గరపడడంతో గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లింగంపేట మండలంలోని పోల్కంపేట్, పోల్కంపేట్ తండాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దివిటి రమేశ్ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. నమూనా బ్యాలెట్తో కారు గుర్తును చూపిస్తూ గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పోల్కంపేట్ గ్రామశాఖ అధ్యక్షుడు రమేశ్, ఏఎంసీ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నరేశ్గౌడ్, నాయకులు హరికృష్ణ, సత్యం, సంజీవులు, విఠల్, పీర్సింగ్, వెంకటి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మొద్దని పెద్దకొడప్గల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి ఓటర్లకు సూచించారు. మండలంలోని విఠల్వాడి, బాబుల్గావ్ తదితర గ్రామాల్లో ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. గాలి అనిల్కుమార్ను జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హన్మంత్రెడ్డి, నాయకులు మహమూద్, గొర్రె శంకర్, చందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామంలో ఎంపీపీనారెడ్డి దశరథ్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంరెడ్డి, ఎంపీటీసీ రాజేందర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్, యూత్ అధ్యక్షుడు నరేశ్, నాయకులు లబ్బరి లింగం, రాజుగౌడ్, మల్లేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ మద్నూర్ మండల నాయకులు అన్నారు. మద్నూర్లో వారు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి గాలి అనిల్కుమార్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో మాజీ సర్పంచ్ దరాస్ సురేశ్, సొసైటీ మాజీ చైర్మన్ పాకల విజయ్కుమార్, నాయకులు కంచిన్ హన్మాండ్లు, తూము హన్మాండ్లు, దేవీదాస్, నాగేశ్, రవి, సాయి, రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
గాంధారి మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఏఎంసీ మాజీ చైర్మన్ రెడ్డి రాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, కొమ్ముల రమేశ్, నాగ్లూర్ మల్లేశ్, జింగురు సురేశ్, దొల్లు సాయిలు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్, బోర్లం, ఇబ్రహీంపేట్, దేశాయిపేట్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమేశ్వర్ గ్రామంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ నెర్రె నర్సింహులు, మాజీ సర్పంచులు నారాయణరెడ్డి, శ్రావణ్కుమార్, నాయకులు నారాయణరెడ్డి, రాజేశ్వర్గౌడ్, మలేశం, మొగులయ్య, గోపన్పల్లి సాయిలు, సాయిలు యాదవ్, పర్వంరెడ్డి, ప్రశాంత్కుమార్, సయ్యద్ జలీల్, మన్నెచిన్న సాయిలు, సత్యం, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలోని 6, 7వ వార్డుల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సతీమణి సోనీరెడ్డి గాలి అనిల్కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బాన్సువాడ పట్టణం మహిళా అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి ప్రతిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలోని 15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గంగాధర్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. 3వ వార్డులో సీనియర్ నాయకులు ఎజాస్ ప్రచారం నిర్వహించారు. మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాబు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.