లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సుయాత్ర కంఠేశ్వర్ బైపాస్కు చేరుకోగానే బాణా సంచాలు కాలుస్తూ ..కేసీఆర్పై పూల వర్షం కురిపించారు. బస్సుయాత్ర వెంట బీఆర్ఎస్ శ్రేణులు వాహనాలపై తరలివచ్చారు. గులాబీ జెండాలు, ఫ్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ జిందాబాద్..కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ వాహనం ధర్నాచౌక్ నుంచి జిల్లా కోర్టు చౌరస్తా వద్దకు చేరుకోగా..అప్పటికే అక్కడ వేచి ఉన్న ప్రజలు, అభిమానులు బాణాసంచాలు కాల్చి ఘన స్వాగతం పలికారు. వారికి కేసీఆర్ బస్సులో నుంచి అభివాదం చేశారు.