న్యూఢిల్లీ : సమాజంలోని అన్ని రకాల రుగ్మతలను పారద్రోలడంతో పాటు ప్రతి రంగంలోనూ మహిళలకు సమానమై హక్కులు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల పరమపదించిన బ్రహ్మకుమారీస్ చీఫ్, రాజయోగిని దాదీ జానకీ స్మారక తపాలా బిళ్ళను సోమవారం ఉపరాష్ట్రపతి తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు సమాజంలో సమానమైన హోదాను కల్పించటంతో పాటు వివిధ రకాల ఇతర సామాజిక వివక్షలను పారద్రోలడంలో బ్రహ్మకుమారీలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారతతో పాటు సమాజంలో ఓ సానుకూల వాతావరణాన్ని ఏర్పరచే లక్ష్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
వేదకాలం నాటి ప్రఖ్యాత గార్గి, మైత్రేయి వంటి మహిళామణుల గురించి ప్రస్తావిస్తూ.. వైభవోపేతమైన భారతదేశ చరిత్రలో ప్రతి రంగంలో మహిళలకు సరైన గౌరవమర్యాదలు దక్కాయని వెంకయ్యనాయుడు అన్నారు. 2019లో బ్రహ్మకుమారీల కేంద్ర స్థానం శాంతివనం (మౌంట్ అబు) ప్రాంగణంలో దాదీ జానకీ దేవిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. సమకాలీన ప్రపంచంలో దాదీ జానకి ఓ ప్రభావవంతమైన ఆధ్యాత్మిక గురువుగా గౌరవాన్ని పొందుతున్నారన్నారు. తాను ప్రవచించిన అంశాన్ని మనసా, వాచా, కర్మణా ఆచరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రహ్మకుమారీలు, దాదీ జానకి ఆలోచనలకు ప్రతిరూపంగా పనిచేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, సీబీఐ మాజీ డైరక్టర్ డీ ఆర్ కార్తికేయన్, బ్రహ్మకుమారీస్ సభ్యులు సోదరి ఆశ, సోదరి శివాని సహా పలువురు బ్రహ్మకుమారీస్ సభ్యులు ప్రత్యక్షంగా, అంతర్జాల మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.
సౌదీ విమానాశ్రయం, ఎయిర్బేస్పై హైతీ డ్రోన్ దాడి
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ప్రభుత్వ చర్యలపై సంతృప్తిగా లేం : గుజరాత్ హైకోర్టు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
సెనేట్లో మెజార్టీ సాధిద్దాం : డొనాల్డ్ ట్రంప్
తొలిసారిగా అంతరిక్షంలో కాలిడిన యూరి గగారిన్.. చరిత్రలో ఈరోజు
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
అమెరికాలో కరోనా మహమ్మారి నాలుగో వేవ్..?!
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..