న్యూఢిల్లీ: జనరేషన్ జెడ్ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) వ్యాఖ్యలు చేశారు. జెన్ జెడ్ అనేది అనుకరణీయమైందని, భావోద్వేగమైందని, కానీ ఆ యువత ప్రశాంతమైన మనసుతో ఆలోచించలేరని అన్నారు. హైదరాబాద్లో జరిగిన విశ్వమాంగ్య సభలో ఆయన మాట్లాడారు. కానీ జెన్ జెడ్లకు ఏది కనిపించినా అది వారికి తగినట్లు ఉంటుందని అన్నారు. ప్రామాణికంగా, సంబంధం ఉన్నట్లుగా అనిపించే ఉద్యమాలకు, ఐడియాలకు యువత ప్రభావితం అవుతుందని మోహన్ భగవత్ అన్నారు. సోషల్ మీడియా ఆధారంగా యువత తాజాగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్న విషయం తెలిసిందే.
తన ప్రసంగంలో మహిళా విముక్తి గురించి కూడా మోహన్ భగవత్ మాట్లాడారు. స్త్రీ ముక్తి ఆందోళన చాలా నెమ్మదిగా విస్తరించిందని, దశలవారీగా ఆ ఉద్యమం \ఆగిందన్నారు. సమానత్వం, విద్య, ఉద్యోగం, అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, రక్షణ, న్యాయపరమైన హక్కుల విషయాలపైన మాత్రమే మహిళా హక్కుల ఉద్యమాలు సాగినట్లు ఆయన చెప్పారు. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి ఆయన మాట్లాడుతూ.. భారతీయ సమాజంలో వాళ్లు భాగమే అని, వారిని వేరు చేయలేమన్నారు. కొందరిలో ఎల్జీబీటీ లక్షణాలు సహజంగా ఉంటాయని, కానీ కొందరు తమ మైండ్సెట్ కారణంగా వాటిని పొందుతున్నారన్నారు. కానీ ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఇక్కడ లేదని మనం అనలేమన్నారు. మనమూ మనుషులమే అని, దీన్ని కూడా విస్తరిస్తున్నట్లు చెప్పారు.
పెళ్లి ద్వారా క్రమశిక్షణ వస్తుందని, దాని ద్వారా ధర్మాన్ని ఆచరించే వీలు ఉంటుందని మోహన్ భగవత్ అన్నారు. కానీ లివిన్ రిలేషన్లో ఉన్న అనర్ధాలను ప్రపంచం అంతా గమనిస్తూనే ఉందని ఆయన అన్నారు.