చందుర్తి, జూలై 11 : నాడు నీటి కోసం తండ్లాడిన సిరిసిల్ల జిల్లా నేడు వాటర్హబ్లా మారింది. ఎటు చూసినా పుష్కలంగా జలవనరులు కనిపిస్తుండగా, చెరువుల్లో చేపల పంట పండుతున్నది. సర్కారు చేపట్టిన నీలివిప్లవం విజయవంతమై, మొన్నటి ఎండాకాలంలో ఊహించనంతగా మత్స్యసంపద చేతికి వచ్చింది.
తాజాగా రామన్నపేట శివారులోని లవుడి చెరువు అలుగు దుంకుతుండగా, గ్రామస్తులు చేపలు పట్టారు. తిమ్మాపూర్కు చెందిన అజయ్కి 19 కిలోల చేప దొరకగా, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దీనిని వేములవాడలోని మార్కెట్లో 3,600కు విక్రయించినట్లు తెలిపారు.